విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా డైరెక్టర్ తండ్రి నిర్వాకం?
జాక్ పాట్ కోట్టే ప్లాన్లో లక్కీ భాస్కర్ సినిమాలానే ఫాదర్ అట్లూరి సుబ్బారావు?
రిజిస్టర్ పేపర్లతో విక్రయించాక సాదా బైనామా పేరుతో మళ్లీ అమ్మకం?
కాసాని జ్ఞానేశ్వర్ దందాకు డిక్రీ పేర్లతో ఆజ్యం?
30 ఏండ్ల క్రితం ఐడీపీఎల్ వర్కర్స్ కొనుగోలు చేస్తే సాదా బైనామా పేర్లతో జలవిహార్ రామరాజు ముప్పుతిప్పలు?
ఇప్పటికే ప్రభుత్వం 22ఏ తో పరేషాన్ అవుతుంటే ప్రైవేట్ దారుల బ్లాక్ మెయిల్తో బెంబేలు!
బాచుపల్లిలో 50 ఏకరాల్లో అట్లూరి నాటిన ఫేక్ అమ్మకాలతో ఇరాకాటంలో పడుతున్న పబ్లిక్ తీరుపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.
భాచుపల్లిలో లక్కీ సుబ్బారావు అమ్మకాలు ఇవే
కొన్ని సార్లు తండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. అలానే లక్కీ భాస్కర్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన తండ్రి చేసిన మోసాలకు ఇప్పటికీ మధ్యతరగతి కటుంబాలకు కొన్నిసార్లు మరణ శాసనం కూడా అవతోంది. అమ్మిన భూమియే అమ్మకం జరపడం. కోర్టుల్లో వాటితో కేసులు వేయడం ఆ తర్వాత కాంప్రమైజింగ్ పేరుతో నాటకాలు ఆడడం తరుచూ బాచుపల్లిలో అలవాటుగా మారింది. బాచుపల్లిలో కాసాని జ్ఞానేశ్వర్ బడా భూములన్నింటినీ సాదాబైనామాతో కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలానే అమ్మిన భూమిపై పాత తేదీల్లో కొనుగోలు చేసినట్లు, రికార్డులు మార్చి 2022లో సివిల్ సూట్లు వేసుకున్నారు. 48 ఎకరాలు సాదా బైనామాపై వచ్చిందని అందుకు డిక్రీ ఇవ్వాలని కోరడంతో ఓఎస్ నెంబర్ 56/2022, 57/2022 ద్వారా రిజిస్టర్ అయిన భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. పొజిషన్ లేకుండానే ఆ డిక్రీతో జలవిహార్ యజమాని రామరాజు పేరుతో అగ్రిమెంట్లు చేశారు. తర్వాత సాదా బైనామా అంటూ మరో నాటకం వేశారు. దీంతో మెజార్టీ ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్ ఓనర్స్ 35 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన ఐడీపీఎల్ ఉద్యోగుల వారసులు ఆందోళన చెందుతున్నారు.
చరిత్ర ఇదే?.. వీక్గా భూ టైటిల్?.. ఇష్టారాజ్యంగా రాసి ఇవ్వడంతో..
బాచుపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 45, 50, 83, 335, 336లో సుమారు 50 ఎకరాల భూమిని 1966లో నిమ్మగడ్డ శ్రీరామనాథం డాక్యుమెంట్ నెంబర్ 157/1966 ద్వారా కొనుగోలు చేశారు. అనంతరం ఆ భూములు రేట్లు లేకపోవడంతో అట్లూరి సుబ్బారావుకు 1983లో జీపీఏ నెంబర్ 11/ 1983 , 1/1991 , 92 ద్వారా అమ్ముకునేందుకు హక్కులు ఇచ్చారు. దీంతో సర్వే నెంబర్ 45లో 9 ఎకరాల 37 గుంటలు, సర్వే నెంబర్ 83లో 2 ఎకరాల 11 గుంటలను ట్రైడెంట్ ఆర్గానిక్స్కు డాక్యుమెంట్ ఐడీపీఎల్ ఎంప్లాయిస్ అసోసియేషన్కు 17 ఎకరాల 26 గుంటలు అమ్మకం జరిపారు. మొత్తం 29 ఎకరాల 34 గుంటలకు రిజిస్ట్రేషన్ పత్రాలతో అమ్మకం చేశారు. డాక్యుమెంట్ నెంబర్ 8310/1991 – 30-09-1991, 8478/1991 – 05-10-1991, 10744/1991 – 27-11-1991, 11161/1991 – 09-12-1991, 23-05-1994 లో అమ్మకం జరపలేని 20 ఎకరాల ల్యాండ్ను తిరిగి ఇస్తున్నట్లు అఫిడవిట్లు ఇచ్చారని పట్టాదారులు చెబుతుతున్నారు. ఇవి ఒకవేళ ఫేక్ అయితే వారి వేలి ముద్రలు సరి చూసుకోవచ్చు. ఫోరెన్సిక్కు ఇప్పటికీ వెళ్లవచ్చు.
సాదా బైనామా మాఫియా
మిగిలిన భూములుగా సర్వే నెంబర్ 50లో 13 గుంటలు, సర్వే నెంబర్ 83లో 2 ఎకరాల 39 గుంటలు, సర్వే నెంబర్ 335లో 14 ఎకరాల 20 గుంటలు, సర్వే నెంబర్ 336లో 2 ఎకరాల 14 గుంటలు ఉన్నట్లు పత్రాల్లో వివరించబడింది.
48 ఎకరాలపై కాసాని జ్ఞానేశ్వర్ క్లెయిమ్
ఇదిలా ఉండగా.. 12-04-1991 తేదీతో ఉన్న సాదా బైనామా పత్రం ఆధారంగా కాసాని జ్ఞానేశ్వర్ సుమారు 48 ఎకరాలపై క్లెయిమ్ చేసినట్లు పేర్కొనబడింది. ఈ వ్యవహారం ఓఎస్ నెంబర్ 56/2022, ఓఎస్ నెంబర్ 57/2022 కేసుల వరకు వెళ్లి డిక్రీ చేయించుకున్నారు. అట్లూరి సుబ్బారావు ప్రభుత్వ భూములను సైతం కాసాని జ్ఞానేశ్వర్కు అప్పగించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
జలవిహార్ రామరాజు పేరుతో మరో సాదా బైనామా!
మరోవైపు జలవిహార్ యజమాని ఎంవీ రామరాజు పేరుతో 03-10-1992 తేదీతో మరో సాదా బైనామా పత్రం వెలుగులోకి వచ్చింది. 18 ఎకరాల 7 గుంటలపై క్లెయిమ్ చేస్తున్నట్లు కోర్టులో కేసులు ఉన్నాయి. తమతో కాంప్రమైజ్ కావాలని సమాచారం పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఓల్డ్ సిటీలో పాత పత్రాలతో దందా?
భూమిపై జీపీఏ ఉందని చెప్పుకుంటూ బాచిపల్లినంతా అమ్మకానికి పెట్టారు అట్లూరి సుబ్బారావు. అందుకు సాధ బైనామా పేరుతో పాత రోజుల్లో పేపర్లు సృష్టించి, రాయించి ఇచ్చి, ఇదే మీకు టైటిల్ అంటూ కలరింగ్ ఇవ్వడం, కొద్ది రోజుల తర్వాత వాల్యుడేషన్ చేయించుకోవడం, ఆ తర్వాత కోర్టులో పొజిషన్ ఉన్నట్లు ఎక్స్ పార్టీ డిక్రీ తెచ్చుకుని ప్లాట్ ఓనర్స్ను ఇబ్బందులకు గురి చేయడం కామన్గా మారింది. ఒకే భూముల వ్యవహారంలో కాసాని జ్ఞానేశ్వర్ పేరుతో 48 ఎకరాలు, రామరాజు పేరుతో 18 ఎకరాల 7 గుంటలు క్లెయిమ్ చేయడంతో మరి అప్పటికే అమ్మిన 30 ఎకరాలు ఎవరిది, తాము రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా భూములు కొనుగోలు చేసినప్పటికీ అదే భూములపై సాదా బైనామాల ఆధారంగా ఇతరులు హక్కులు కోరుతున్న నేపథ్యంలో తమ భూముల భవిష్యత్తుపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదానికి కేంద్రంగా మారిన సాదా బైనామాల సంతకాలు, చేతిరాత, తేదీలు, స్టాంప్ పేపర్లు, ఇంక్, ఓవర్ రైటింగ్ అన్నిటికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. భూములపై హక్కులు చూపిస్తూ కోట్ల రూపాయల లావాదేవీలు, సెటిల్మెంట్లు, చెల్లింపులు జరుపుతున్నారు. అఫిడవిట్ కంటే ముందు రోజుల్లో పేపర్లు సృష్టించి తక్కువ ధర అంటూ ఆశ చూపి అమ్ముకోవడం, ఆ తర్వాత కేసులు వేయించడం, ఈ లక్కి సుబ్బారావుకే తెలుసు. ఈయన కోడుకు సినిమాలు తీస్తున్నారు. ఈ మధ్య విశ్వనాథ్ అండ్ సన్స్ తీశారు. అంతకుముందు లక్కీ భాస్కర్ చేశారు. మీ ఇంట్లోనే అలాంటి లక్కీదారులు ఉన్నారు. గుర్తించండి. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే సన్స్ లా ఉండాలంటే విశ్వనాథ్ సన్స్ లా మీరే మీ నాన్న అమ్మిన భూములకు దారి చూపించి మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలి. ఫేక్ డ్యాకుమెంట్లతో జరుగుతున్న దందాకు అడ్డుకట్ట వేయాలి. లేదంటే 70 ఏండ్ల తండ్రి ఈనాడు దోషిగా నిలబడే అవకాశాలు లేకపోలేదు.










