[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-modi-warning-to-pak":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":34,"published_at":35,"updated_at":36,"public_read_count":37,"body":38,"images":39,"video_url":5,"video_urls":42,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":43,"read_next":46,"sponsored_content":93},5157,1735,"modi-warning-to-pak","ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్","పాకిస్థాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే.. ఇక మాటలతో సమాధానం ఉండదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చినా.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న సంకేతాన్ని ఇచ్చారు. అవసరమైతే పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేస్తామని తేల్చిచెప్పారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fc08e14-c8b9-4485-80ad-e655cef705cf.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fc08e14-c8b9-4485-80ad-e655cef705cf.jpg","Kashi","international","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29,30,31,32,33],"PM Modi","Narendra Modi","Pakistan Warning","India Pakistan","Ghar Mein Ghuske Maarte Hain","Terrorism","Pakistan Terrorism","Indian Army","Indian Armed Forces","India News","Breaking News","PM Modi Speech","SRCC","Delhi News","National Security","8 నిమిషాల పఠనం","2026-09-05T17:02:12+00:00","2026-09-05T17:02:19+00:00",55,"\u003Cp>భారత్‌ జోలికొస్తే వదిలేది లేదన్న ప్రధాని.. \u003C\u002Fp>\u003Cp>ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించే హెచ్చరిక\u003C\u002Fp>\u003Cp>పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేస్తామని వార్నింగ్\u003C\u002Fp>\u003Cp>పాకిస్థాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే.. ఇక మాటలతో సమాధానం ఉండదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చినా.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న సంకేతాన్ని ఇచ్చారు. అవసరమైతే పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేస్తామని తేల్చిచెప్పారు.\u003C\u002Fp>\u003Cp>ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న మోదీ.. పాకిస్థాన్ పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. “పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసం చేస్తే.. భారత సాయుధ బలగాలు వారి భూభాగంలోకి ప్రవేశించి దాడి చేస్తాయి. ఘర్ మే ఘుస్కే మార్తే హై” అంటూ ఆయన చేసిన హెచ్చరిక.. భారత్ ఉగ్రవాదంపై అనుసరిస్తున్న కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.\u003C\u002Fp>\u003Cp>ఉగ్రవాదం పెంచితే.. మూల్యం తప్పదు!\u003C\u002Fp>\u003Cp>భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సరిహద్దుల అవతల నుంచి దాడులు చేయించే ప్రయత్నాలను ఇక సహించేది లేదన్నదే మోదీ మాటల్లో కనిపించింది. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే శక్తులు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నాయని ఆయన అన్నారు.\u003C\u002Fp>\u003Cp>భారత్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నించే వారికి గట్టి సమాధానం ఇచ్చే సామర్థ్యం దేశానికి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్థాన్ మరోసారి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా.. భారత బలగాలు కేవలం సరిహద్దుల వద్దే ఆగిపోవన్న సందేశాన్ని ఇచ్చారు. అంటే.. ఉగ్రవాదానికి ఉసిగొల్పితే దాని ప్రభావం పాకిస్థాన్ భూభాగంలోనే కనిపించేలా చర్యలు ఉంటాయని మోదీ హెచ్చరించారు.\u003C\u002Fp>\u003Cp>‘ఘర్ మే ఘుస్కే మార్తే హై’.. ఎందుకంత కీలకం?\u003C\u002Fp>\u003Cp>మోదీ చేసిన “ఘర్ మే ఘుస్కే మార్తే హై” వ్యాఖ్య ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఉగ్రవాదంపై భారత్ గతంలో అనుసరించిన విధానానికి, ఇప్పుడు అనుసరిస్తున్న విధానానికి మధ్య ఉన్న తేడాను ఈ ఒక్క మాటలోనే ప్రధాని చెప్పినట్టైంది.\u003C\u002Fp>\u003Cp>భారత్‌పై దాడి జరిగితే.. దాడి చేసిన ప్రాంతంలోనే ప్రతిదాడి చేస్తామనే సందేశాన్ని ఈ వ్యాఖ్య ద్వారా స్పష్టంగా ఇచ్చారు. ఇది కేవలం రాజకీయ హెచ్చరిక మాత్రమేనా? లేక భవిష్యత్తులో భారత్ తీసుకోబోయే చర్యలకు ముందస్తు సంకేతమా? అన్న చర్చ కూడా మొదలైంది. అయితే మోదీ వ్యాఖ్యల ప్రధాన ఉద్దేశం మాత్రం స్పష్టమే. భారత్‌పై ఉగ్రదాడి చేస్తే దాని మూల్యం చెల్లించక తప్పదని పాక్‌కు గట్టి సంకేతం ఇవ్వడం. \u003C\u002Fp>\u003Cp>కశ్మీర్‌ నుంచి ఈశాన్యం వరకు.. శాంతి \u003C\u002Fp>\u003Cp>ఇదే సందర్భంగా దేశంలో శాంతిభద్రతల పరిస్థితిపైనా ప్రధాని మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పెరిగిందని చెప్పారు. ఒకప్పుడు దేశాన్ని పట్టిపీడించిన మావోయిస్టు ఉగ్రవాదం, నక్సలిజం కూడా తీవ్రంగా బలహీనపడిందని మోదీ పేర్కొన్నారు. దేశంలో ఒకప్పుడు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉందని ప్రపంచం భావించేదని.. ఇప్పుడు అదే ప్రపంచం భారత్‌ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న దేశంగా, డైనమిక్ పాలసీలతో ముందుకు వెళ్తున్న దేశంగా చూస్తోందని అన్నారు.\u003C\u002Fp>\u003Cp>అంటే.. దేశ భద్రత విషయంలోనూ, అంతర్గత శాంతిభద్రతల విషయంలోనూ భారత్ ఇక వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదన్న సందేశాన్ని ప్రధాని ఇచ్చారు.\u003C\u002Fp>\u003Cp>యువత వేదికపై.. పాక్‌కు వార్నింగ్ ఎందుకు?\u003C\u002Fp>\u003Cp>మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన వేదిక కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. మెట్రోలో ప్రయాణిస్తూ కాలేజీకి చేరుకున్న ఆయన.. మార్గమధ్యంలో చిన్నారులతోనూ ముచ్చటించారు.\u003C\u002Fp>\u003Cp>శతాబ్ది పూర్తి చేసుకున్న SRCCని మోదీ ప్రశంసించారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఒక సంస్థ సాధారణ సంస్థ కాదని.. అది ఎన్నో విజయాల సముద్రమని అన్నారు. ఈ సంస్థ ఎన్నో తరాల విద్యార్థులను తీర్చిదిద్దిందని, వారికి ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకునే మార్గం చూపిందని పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>SRCC పూర్వ విద్యార్థులను మోదీ తనదైన శైలిలో “OGs” అంటూ అభివర్ణించారు. ఆర్థిక రంగానికే పరిమితం కాకుండా.. వివిధ రంగాల్లో SRCC పూర్వ విద్యార్థులు తమదైన ముద్ర వేశారని అన్నారు.\u003C\u002Fp>\u003Cp>2013 తర్వాత మళ్లీ అదే క్యాంపస్‌లో..\u003C\u002Fp>\u003Cp>మోదీకి SRCCతో ఉన్న అనుబంధం కూడా ఆసక్తికరమే. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఈ కాలేజీని సందర్శించారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా శతాబ్ది వేడుకలకు హాజరయ్యారు.\u003C\u002Fp>\u003Cp>ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ SRCC శతాబ్ది సందర్భంగా కాలేజీ గవర్నింగ్ బాడీ, ప్రతినిధి బృందంతో మోదీ తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేశారు.\u003C\u002Fp>\u003Cp>అయితే ఈసారి SRCC వేదిక కేవలం విద్య, యువత గురించి మాట్లాడటానికే పరిమితం కాలేదు. అదే వేదికపై నుంచి పాకిస్థాన్‌కు మోదీ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ రాజకీయంగా, వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.\u003C\u002Fp>\u003Cp>ఒక్క మాటలో పాక్‌కు క్లియర్ మెసేజ్!\u003C\u002Fp>\u003Cp>మోదీ తాజా వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తే.. భారత్ చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోదు. దాడి ఎక్కడి నుంచి వస్తే.. సమాధానం అక్కడికే వెళ్లొచ్చన్నదే మోదీ హెచ్చరిక. అందుకే మరోసారి “ఘర్ మే ఘుస్కే మార్తే హై!” అనే మాట‌ తెరపైకి వచ్చింది. \u003C\u002Fp>",[40],{"url":13,"name":41},"pakistan_warning_compressed_1mb.jpg",[],{"title":44,"description":45},"PM Modi Warns Pakistan: “Ghar Mein Ghuske Maarte Hain”","PM Modi issues a strong warning to Pakistan, saying India will strike back inside its territory if terrorism targets Indian soil.",[47,56,62,69,77,83,88],{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":55},"govt-special-focus-on-kollapur-development-says-minister-jupally-krishna-rao","Jupally Krishna Rao: రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు.. రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్.. కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యం","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fba16de59-48ef-498f-9d3e-5cab10359188.jpg","NK","10 నిమిషాల పఠనం","2026-09-05T17:07:23+00:00",4,{"slug":57,"title":58,"category":50,"image":59,"author":52,"read_time":60,"published_at":61,"public_read_count":37},"will-not-leave-revanth-reddy-govt-bjp-mp-eatala-rajender-strong-warning","Eatala Rajender: రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు- ఈటల శపథం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0017d57b-7a0f-4b9a-9ebe-8af2d36a87fd.jpg","12 నిమిషాల పఠనం","2026-09-05T17:24:40+00:00",{"slug":63,"title":64,"category":50,"image":65,"author":66,"read_time":67,"published_at":68,"public_read_count":37},"tg-politics-congress-brs-bjp-public-meetings-telangana-political-heat","TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff2947a56-473e-4a09-bd57-0c5efbd37b1f.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-05T16:45:36+00:00",{"slug":70,"title":71,"category":72,"image":73,"author":74,"read_time":75,"published_at":76,"public_read_count":37},"vaishnavi-chaitanya-epic","Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fddafce-0c2e-423c-92c6-1365265bb2da.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-05T16:38:34+00:00",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":66,"read_time":75,"published_at":82,"public_read_count":55},"tg-safe-raids-719-476-150-1760-21-12-14","TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8668f45-cc81-4b36-a556-30d4782e4acc.webp","2026-09-05T16:34:48+00:00",{"slug":84,"title":85,"category":50,"image":86,"author":52,"read_time":75,"published_at":87,"public_read_count":55},"cm-revanth-reddy-open-challenge-to-ktr-and-harish-rao-in-nakrekal-public-meeting","Cm Revanth Reddy: ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fda9c2543-01ac-47e9-8860-7fe56660ae61.jpg","2026-09-05T16:18:57+00:00",{"slug":89,"title":90,"category":50,"image":91,"author":66,"read_time":75,"published_at":92,"public_read_count":55},"telangana-politics-komatireddy-rajagopal-reddy-closeness-with-revanth-reddy-sparks-cabinet-expansion-talk","TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి ఖాయమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6771609-0b62-407a-9be7-c1c710cd4263.jpg","2026-09-05T15:48:02+00:00",[94,99,102,104,106,108],{"title":95,"sponsor":96,"image":97,"url":98},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":100,"sponsor":101,"image":97,"url":98},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":103,"sponsor":101,"image":97,"url":98},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":105,"sponsor":101,"image":97,"url":98},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":107,"sponsor":101,"image":97,"url":98},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":109,"sponsor":101,"image":97,"url":98},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]